Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: విలాసవంతమైన మోటర్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటీ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా రానున్న రోజుల్లో భారత్లోని ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి సారించనుంది. ప్రస్తుతం తొమ్మిది డీలర్షిప్లతో సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో విక్రయాలను నిర్వహిస్తోందని సంస్థ ఎండీ సెర్గీ కనోవస్ తెలిపారు. విస్తరణలో భాగంగా రానున్న రోజుల్లో ఇక ద్వితీయశ్రేణి నగరాలపై దృష్టి సారించనున్నట్టుగా ఆయన తెలిపారు. మేటి సదుపాయాలతో రైడర్ల దృష్టిని ఆకర్షించుకుంటూ భారత మార్కెట్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడమే లక్ష్యంగా వచ్చే రెండేండ్ల పాటు కృషి చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. డుకాటీ కొత్తగా రూపొందించిన స్క్రాంబ్లర్ శ్రేణిలో నాలుగు కొత్త వాహనాలను సంస్థ శుక్రవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. స్క్రాంబ్లర్ ఐకాన్, డెసర్ట్ స్లెడ్, ఫుల్ థ్రాటెడ్, కేఫ్ రేసర్ పేర్లోతో సంస్థ ఈ కొత్త వాహనాలను మార్కెట్లోకి ఆవిష్కరించింది. వీటి ధరలను కంపెనీ వరుసగా రూ.7.89 లక్షలు, రూ.9.93 లక్షలు, రూ.8.92 లక్షలు, రూ.9.78 లక్షలుగా (ఎక్స్షోరూమ్, ఇండియా) కంపెనీ నిర్ణయించింది. మొత్తం ఏడు విభాగాల్లో సంస్థ దాదాపు 27 మోడళ్లలో వాహనాలను అందిస్తోందని కనోవస్ వివరించారు.