Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిరిండియా సర్వీసులకు విఘాతం
న్యూఢిల్లీ: ఎయిరిండి యాకు చెందిన చెక్ఇన్ సాఫ్ట్వేర్ సర్వర్ సాంకేతిక సమస్యతో మూతపడడంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుకు గురయ్యారు. సాంకేతిక సమస్య కారణంగా దాదాపు ఐదు గంటల పాటు సర్వర్ నిలిచిపోవడంతో 155 విమానాల ప్రయాణంలో ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో నానా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయమై ఎయిరిండియా చైర్మెన్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ లోహాని వివరణనిస్తూ శనివారం ఉదయం 3.30 నుంచి 8.45 గంటల వరకు చెక్ఇన్, బ్యాగేజ్, రిజర్వేషన్ అంశాలను నిర్వహించే ప్యాసెంజర్ సర్వీస్ సిస్టిమ్లో (పీఎస్ఎస్) సాంకేతిక కారణం చేతన నిలిచిపోయిందని తెలిపారు. దీంతో ఉద్యోగులు బోర్డింగ్ పాస్లను జారీ చేయలేక పోయారని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు నిలిచిపోయారని తెలిపారు. ఎయిరిండియా సంస్థ అట్లాంటా కేంద్రంగా పని చేస్తున్న సిటా పీఎస్ఎస్ను వాడుతోంది. సర్వర్ నిలిచిపోయిన సమయంలో దాదాపు 85 విమానాలు ప్రభావితం అయ్యాయని.. వీటి కారణంగా మరో 70 కనెక్టివిటీ విమాన సర్వీసులకు విఘాతం కలిగిందని ఎయిరిండియా చైర్మెన్ తెలిపారు. ఎయిరిండియా సంస్థ అనుబంధ విమాన సంస్థలైన అలయన్స్ ఎయిర్, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లతో కలిపి రోజుకు సగటున 674 విమానాలను నడుపుతుంది.