Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ విపణిలో దిగ్గజ శాంసంగ్ను చూసి పలు విషయాలు నేర్చుకున్నామని మరొక దిగ్గజ సంస్థ షావోమీ తెలిపింది. 'అవును! చాలా విషయాలను ఇతర బ్రాండ్ల నుంచి నేర్చుకున్నాం. అందులో శాంసంగ్ కూడా ఉంది. ఆఫ్లైన్లో శాంసంగ్ మార్కెట్ సేల్స్ ఎలా ఉన్నాయో పరిశీలించాం. అందుకు తగిన విధంగా మా బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నాం' షావోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ చెప్పుకువచ్చారు. భారత ఆఫ్లైన్ మార్కెట్లో శాంసంగ్దే అగ్రస్థానం. బ్రాండ్, ఫోన్ల తయారీలో నాణ్యత ఇవన్నీ ఆ మొబైల్ను ప్రజల్లోకి విస్త తంగా తీసుకెళ్లాయి. అయితే, ఆన్లైన్లో మాత్రం షావోమీదే పైచేయి. ఈ నేపథ్యంలో ఆఫ్లైన్లోనూ తమ మొబైల్ విక్రయాలను పెంచాలన్న ఉద్దేశంతో రెండేళ్లుగా ఆ దిశగా అడుగులు వేస్తోంది షావోమీ. ఇప్పటికే 20శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 'ఆఫ్లైన్లో విక్రయాలు ప్రారంభించినప్పుడు చాలా సమస్యలను ఎదుర్కొన్నాం. మొదటి ఆరు నెలల్లో మా స్మార్ట్ఫోన్లను విక్రయించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఇతర బ్రాండ్లు ఏం చేస్తున్నాయో పరిశీలించాం. ముఖ్యంగా శాంసంగ్, వీవోలకు ఆఫ్లైన్లో బలమైన మార్కెట్ ఉంది. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుని మేము ఏం చేయాలో ప్రణాళికలు రచించాం'' అని జైన్ తెలిపారు.