Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలనెదుర్కొన్న ప్రయాణికులు
న్యూఢిల్లీ: సాంకేతిక సమస్య కారణంగా ఆదివారం కూడా ఎయిరిండియా విమానాలు ఆలస్యంగా నడిచాయి. 'చెక్ ఇన్' సాఫ్ట్వేర్ ఐదు గంటలకుపైగా స్తంభిం చడంతో శనివారం ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమాన సర్వీసుల్లో జాప్యం జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం కూడా 137 విమానాల రాకపోకలు ఆలస్యంగా సాగుతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు వేచి ఉన్నారు. సాధారణ సమయం కంటే సగటున 197 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయని ఎయిర్ ఇండియా అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. సాధారణంగా తొలి సెక్టార్లో ఒక విమానం ఆలస్యమైతే వాటి ప్రభావం మిగతా విమానాల మీద కూడా పడుతుంది. ఎయిర్ ఇండియా గ్రూపులో ప్రస్తుతం అలయెన్స్ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన 674 విమానాలు ఉన్నాయి. అయితే ఈ సాంకేతిక సమస్య ప్రభావం ఎక్కువగా దేశీయ సర్వీసుల మీదే ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సాఫ్ట్వేర్ షట్డౌన్ వల్ల శనివారం 149 విమానాలు ఆలస్యంగా నడిచిన విషయం తెలిసిందే.