Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: యెస్ బ్యాంక్ షేర్లు మంగళవారం అనూహ్యరీతిలో పతనమయ్యాయి. మంగళవారం ఒక్క సెషన్లోనే ఈ షేరు విలువ దాదాపు 30శాతం మేర పతనమైంది. బ్యాంక్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆశ్చర్యకరంగా నష్టాలను ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. నష్టాలు రావడంతో చాలా అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు బ్యాంక్ రేటింగ్ను తగ్గించాయి. ఫలితంగా మదుపరులు ఈ సంస్థ షేర్లను భారీగా విక్రయించారు. ఎక్కువగా ఎఫ్ఐఐలు తమ వాటాను వెనక్కి తీసుకున్నారు దీంతో మంగళవారం ఉదయం రూ.213.50 వద్ద ప్రారంభమైన షేరు విలువ ఆ తరువాత క్రమంగా పతనమవుతూ వచ్చింది. ఒక దశలో 30.18 శాతం విలువను కోల్పోయి రూ.165.6 వద్ద ట్రేడయింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయంలో పెద్దగా కోలుకోకుండానే రూ.166.75 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. విదేశీ బ్రోకరేజీ సంస్థలు అయితే దీని రేటింగ్లో భారీ కోత విధించాయి. ఆశించిన స్థాయిలో కూడా రాణించలేదని పేర్కొన్నాయి. రూ.165 టార్గెట్ ధరగా ప్రకటించాయి. పతనంతో మంగళవారం ఒక్కరోజే యెస్ బ్యాంక్ దాదాపు రూ.1600 కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయింది.
అదే దాటిలో అడాగ్ షేర్లు..
అనిల్ అంబానీకి చెందిన అడాగ్ షేర్లకు రేటింగ్షాక్ తగిలింది. అనిల్ అంబానీ గ్రూప్నకు చెందిన కంపెనీల షేర్లు 20 శాతానికిపైగా నష్టపోయాయి. రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ కౌంటర్లలో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. రేటింగ్ సంస్థలు కంపెనీల షేర్లపై రేటింగ్ను డౌన్లోడ్ చేయడం, ఆయా కంపెనీలు ఎదుర్కోంటున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ట్రేడింగ్ ప్రారంభం నుంచి అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రిలయన్స్ పవర్ 20 శాతం నష్టపగా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 18 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 12 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 10 శాతం, రిలయన్స్ నావెల్ అండ్ ఇంజినీరింగ్స్ 6 శాతం, రిలయన్స్ నిప్పన్ లైఫ్ అస్సెట్ మేనేజ్మెంట్ 7 శాతం నష్టపోయాయి. రిలయన్స్ పవర్ స్టాక్స్ ఆల్ టైం కనిష్టానికి పడిపోయాయి.