Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు పడిపోయే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అభిప్రాయపడింది. దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉండడంతో పాటు.. పారిశ్రామికోత్పత్తి తగ్గడం వల్ల వృద్ధిరేటు 7.3 శాతానికి పడిపోవచ్చని తన తాజా నివేదికలో పేర్కొంది. ఫిచ్ గ్రూపుకు చెందిన ఈ సంస్థ గతంలో వృద్ధిరేటు అంచనాలను వెలువరిస్తూ భారత్ జీడీపీ 7.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తాజాగా దానిని 7.3 శాతానికి తగ్గించడం విశేషం. దీనికి తోడు బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు, నెషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కు చేరిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్కు చెందిన దివాలా కేసుల విచారణలో మందగమనం కూడా జీడీపీపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తెలిపింది.