Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6నెలల పాటు 'సెక్యూరిటీ' నిషేధం
- రూ.630 కోట్లు కట్టాలంటూ ఆర్డర్
ముంబయి: ట్రేడింగ్ కార్యకలాపాల్లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) అక్రమాలకు పాల్పడిందన్న విషయమై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సీరియస్ అయింది. ఎన్ఎస్ఈ 2010-11 నుంచి 2013-14 మధ్య కాలంలో కొ-లొకేషన్ కార్యకలాపాలను నిర్వహించి అక్రమంగా లాభాలను ఆర్జించిందని సెబీ నిర్ధారణకు వచ్చింది. కొ-లొకేషన్ అంటే అక్రమంగా ఎక్స్ఛెంజీ ప్రత్యేక నెట్వర్క్ ద్వారా హైఫ్రీక్వెన్సీ ట్రేడర్లు వేగంగా ట్రేడింగ్ను నిర్వహించుకొనేందుకు వెసులుబాటు కల్పించడం. ఇలా చేయడం ద్వారా ఎన్ఎస్ఈ దాదాపు రూ.625 కోట్ల మేర లాభాలను ఆర్జించినట్టుగా సెబీ విచారణలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఎన్ఎస్ఈపై వేటు వేసింది. సెక్యూరిటీ మార్కెట్ల నుంచి ప్రత్యక్షంగా గానీ.. లేక పరోక్షంగా గానీ ఆరు నెలల వరకు నిధులు సమీకరించకుండా సెబీ నిషేధం విధించింది. ఈ సమయంలో అక్రమాల ద్వారా ఎన్ఎస్ఈ ఆర్జించిన దాదాపు రూ.624.89 కోట్ల లాభాన్ని ఏడాదికి 12 శాతం వడ్డీ కలుపుకోని ఇన్వెష్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్కు చెల్లించాలని సెబీ తన తీర్పులో కోరింది. కొ-లొకేషన్ కార్యకలాపాలలో ఎన్ఎస్ఈకి చెందిన ఉన్నతాధికారుల పాత్ర ఎంతవరకు ఉందన్న అంశంపై ఎన్ఎస్ఈ వర్గాలు తదుపరి విచారణనను కొనసాగిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ఎన్ఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవి నారిన్, చిత్రా రామకృష్ణలు కొ-లొకేషన్ జరిగిన సంవత్సరాలలో పొందిన వేతనాల్లో దాదాపు 25 సొమ్మును తిరిగి అప్పగించాలని సెబీ కోరింది. ఈ కేసుకు సంబంధించిన 104 పేజీల తీర్పును సెబీ వెల్లడిస్తూ నారిన్, రామకృష్ణలు మార్కెట్ ఇన్ఫ్రా ఇన్స్టిట్యూషన్, మార్కెట్ ఇంటిర్మీడియెడియరీ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా సెబీ ఐదేండ్ల పాటు నిషేధం విధించింది.