Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోని నుంచి మరో ఆండ్రాయిడ్ ఆధారిత టీవీ
న్యూఢిల్లీ: సోనీ సంస్థ అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి మరో ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని అందుబాటులోకి తెచ్చింది. 75 అంగుళాల స్క్రీన్తో సోనీ 4కే అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ టీవీని ''కేడీ75 ఎక్స్ 9500జీ'' పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ. 4,49,990 గా నిర్ణయించింది. ఆండ్రాయిడ్ 8.0 సపోర్టుతో లభిస్తున్న 75 అంగుళాల స్క్రీన్, బెజెల్ లెస్ డిస్ప్లే ఈ టీవీల ప్రధాన ఆకర్షణ. ఇంకా 3840, 2160 ఫిక్సెల్స్ రిజల్యూషన్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, ఎక్స్1 అల్టిమేట్ పిక్చర్ ప్రాసెసర్, ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్ బ్యాక్లైట్, అల్ట్రా వైడ్ వ్యూయింగ్ యాంగిల్, నెట్ఫ్లిక్స్ కాలిబ్రేటెడ్ మోడ్, 16 జీబీ స్టోరేజ్ ఈ టీవీలోని అదనపు హంగులు. దేశవ్యాప్తంగా సోనీ సెంటర్, ఇతర ఎలక్ట్రానిక్స్ స్టోర్ల ద్వారా ఈ సూపర్ టీవీలు అందుబాటులో ఉండనున్నాయన కంపెనీ వెల్లడించింది. మామూలు ఎల్ఈడీ టీవీల కంటే ఆరు రెట్లు ఎక్కువ క్వాలిటీ పిక్చర్ అందిస్తుందని కంపెనీ చెప్పింది. మెటి నాణ్యమైన ప్రసారాలను కావాలని కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని తాము ఈ టీవీలను రూపొందించినట్టుగా సోనీ సంస్థ తెలిపింది.