Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర రూ.9.86-11.20 లక్షలు: మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి డీజిల్ ఇంజిన్ కార్లను నిలిపివేయనున్నట్టుగా ప్రకటించిన దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ..అందుకు భిన్నంగా కొత్త డీజిల్ ఇంజిన్తో రూపొందించిన సరికొత్త ఎర్టిగా కారును సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో కొత్తగా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ డీడీఐఎస్ 225 డీజిల్ ఇంజిన్ను అమర్చింది. ఈ కారును వీడీఐ, జెడ్డీఐ, జెడ్డీఐ ప్లస్ అనే మూడు వేరియంట్లలో సంస్థ విక్రయించనుంది. వీటి ప్రారంభ ధర రూ.9.86లక్షలుగాను గరిష్ట ధరను రూ.11.20 లక్షలుగాను కంపెనీ నిర్ణయించింది. పాత 1.3 లీటర్ డీడీఐఎస్ 200 ఇంజిన్ స్థానంలో సరికొత్త డీడీఐఎస్ 225 ఇంజిన్తో దీనిని తయారు చేశారు. గతంలో పాత ఇంజిన్ను ఫియట్ నుంచి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం మాత్రం పాత ఇంజిన్కు అదనంగా సరికొత్త ఇంజిన్ను కూడా మారుతీ ఆఫర్ చేస్తోంది. కొత్త డీడీఐఎస్ 225 1498 సీసీ ఫోర్ సిలిండర్ను కలిగి ఉంది. ఇది 4000 ఆర్పీఎం వద్ద 94 బీహెచ్పీ శక్తి, 1500-2500 ఆర్పీఎం వద్ద 225ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది. దీనిలో డ్యూయల్ మాస్ ఫ్లైవీల్టెక్నాలజీని వాడారు. ఇది ఇంజిన్, ట్రాన్స్మిషన్ మధ్య అనుసంధానం ఏర్పరిచి టార్క్ను సరిగా పంపిణీ అయ్యేట్లు చూస్తుంది. ఎంపీవీ సెగ్మెంట్లో అత్యధికంగా విక్రయించే వాహనంగా రికార్డు సాధించింది.