Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎన్బీలో కలిసిపోనున్న యుబీఐ, బీవోఐలు
- మరో ఆరు నెలల్లోనే విలీనం పూర్తికి సన్నాహాలు
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగానికి విలీనాలు మంచివి కావని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నప్పటికీ సర్కారు ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు సరికదా.. మరో దఫా భారీ బ్యాంకుల విలీనానికి కసరత్తు చేస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), యూని యన్బ్యాంకు ఆఫ్ ఇండియా (యుబీఐ), బ్యాంకు ఆఫ్ ఇండియాల (బీవోఐ) విలీ నం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం. ఈ మేరకు ప్రభు త్వం ఆయా బ్యాంకుల యాజమాన్లాతో రెండవ దఫా విలీన చర్చలు జరుపుతు న్నట్టుగా ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ల విలీనం చేపట్టిన ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి అడుగులు వేస్తుండడం విశేషం. తుది చర్చల అనం తరం విలీనానికి ఆయా బ్యాంకులకు ఆహ్వానం పంపించే అవకాశం ఉందని సదరు అధికారి తెలిపారు. ఈ విలీన ప్రక్రియ కోసం ఎంతో కాలం వేచి వుండాల్సి వస్తుందని తాము భావించడం లేదనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా, మూడవ త్రైమాసికంలో విలీనం ఉండవచ్చని ఆయన సూచన ప్రాయంగా తెలి పారు. అలాగే బ్యాంకులు తగిన ప్రతిపాదనలు ఇవ్వడంలో విఫలమైతే, ప్రత్యా మ్నాయ విధానం (ఏఎం) గ్రూప్ తగిన సలహాలను ఇస్తుందని ఆయన మీడి యాకు చెప్పారు. కాగా విజయ, దేనా, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) విలీన ప్రక్రి య గత ఏడాది అక్టోబరులో మొదలై , ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విలీనం తరువాత బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు దేశంలోని అతి పెద్ద విత్త సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్లో (ఎస్బీఐ) అయిదు అనుబంధ బ్యాంకులతో పాటుగా ఒక మహిళా బ్యాంక్ కూడా విలీనమైన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యాంకుల్లో సమస్యలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు సరికదా పలు బ్యాంకు శాఖలు మూతపడుతున్నాయి. తాజాగా విలీనమైన బీవోబీ దేనా బ్యాంక్, బీవోబీ, విలీనం తరువాత కూడా పలు సమస్యలు వస్తున్నాయని ఉద్యోగులు బాహాటగంగానే చెబుతూ వస్తున్నారు. వీటి పరిష్కారానికి చర్యలు చూపని సర్కా రు.. మొండిగా మరో దఫా బ్యాంకుల విలీనాన్ని చేపట్టే దిశగా అడుగుల వేయడా న్ని ఇటు ఉద్యోగ సంఘాల వారితో పాటుగా.. అటు ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు.