Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు
ముంబయి: దేశంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి రూ.లక్ష కోట్ల స్థాయిని దాటేసినట్టు సర్కారు బుధవారం వెల్లడించింది. ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.1.13 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అంతకుముందు (మార్చి) నెలలో ఈ పన్ను వసూళ్లు 1.06 లక్షల కోట్ల రూపాయలుగా నమోదు అయ్యాయని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 ఏప్రిల్లో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,13,865 కోట్లుగా నమోదు కాగా.. ఇందులో సీజీఎస్టీ వసూళ్లురూ.21,163 కోట్లు గాను, ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.28,801 కోట్లుగాను, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వసూళ్లు రూ.54,733 కోట్లుగాను నమోదైందని సర్కారు తెలిపింది. సెస్ రూపంలో దాదాపు రూ.9,168 కోట్ల సొమ్ము ఖజానాకు చేరిందని అధికారులు వివరించారు. ఏప్రిల్ 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చి 1 నుంచి ఏప్రిల్ 30 వ తేదీ వరకు గరిష్ఠంగా 72.13 లక్షల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టీ) వసూళ్లు రికార్డు క్రియేట్ చేశాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.