Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: కార్పొరే షన్ బ్యాంక్ సమాజహితం కోరుతూ వివిధ సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నట్టుగా ఆ బ్యాంక్ మహబూ బ్నగర్ శాఖ మేనేజర్ ఎస్.వి.ఎస్.ఆర్.దేవి అన్నారు. బుధ వారం బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బ్యాంక్ ప్రముఖ ఖాతాదారు జి.పద్మజా రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రక్తదానం వల్ల అపదలో ఉన్న ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పద్మజా రెడ్డి మాట్లాడుతూ బ్యాంక్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వర్గాల సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బందితో పాటు పలువురు ఖాతాదారులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో బ్యాంక్ సుపరింటెండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ వేసవి ఎండలు మండుతున్న ప్రస్తుత తరుణంలో కూడా కార్పొరేషన్ బ్యాంక్ చేపట్టిన సామాజిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని అభినందించారు. రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కార్యక్రమం చివర్లో సర్టిఫికెట్లను జారీ చేశారు.