Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో అపరంజి ధరలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. పసిడికి దేశీయంగా డిమాండ్ పెరగడం, అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య అనిశ్చితి కారణంగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. మంగళవారం న్యూఢిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 377 రూపాయలు పెరిగి రూ .33,395 కు చేరుకుంది. మరోవైపు వెండి ధర 300 రూపాయలు పెరిగింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 38,300 కి చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 32,390 రూపాయలుగా పలికింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.30,850గా నిలిచింది. స్థానికంగా గిరాకి పెరగడంతో పాటు, అమెరికాౖ-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటుండడం వల్ల బంగారం వాణిజ్యంపై అంతార్జాతీయంగా ప్రతికూల ప్రభావం పడుతోందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే పసిడి ధరలు పరుగులు పెడుతున్నట్టుగా వారు విశ్లేషిస్తున్నారు.