Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్దేశపూర్వకంగా ధరలు పెంచారని కేసులు
- రెడ్డీస్తో సహా 6 కంపెనీలపై అభియోగాలు
- దాదాపు 40 రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు..
- అమెరికాలో భారీ హెల్త్ కుంభకోణం:యుఎస్ఏ
- భారీగా పడిపోయిన ఔషధ కంపెనీలు షేర్లు..
వాషింగ్టన్: అమెరికాలో ఔషధాల విక్రయాలు జరుపుతున్న భారత ఫార్మా దిగ్గజ సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అనుచితంగా మందుల ధరల పెంపునకు కుట్ర పన్నారంటూ సన్ పార్మా, డాక్టర్ రెడ్డీస్తో సహా ఏడు భారతీయ కంపెనీలతో పాటు.. మొత్తం 20 ఫార్మా కంపెనీలపై అమెరికాలో కేసులు నమోదు అయ్యాయి. అందరికీ అవసరమైన మందుల ధరలకు కంపెనీలు ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నాయంటూ అమెరికాలోని 40కి పైగా రాష్ట్రాల్లోను, యాంటీ ట్రస్ట్ సంస్థలోనూ ఈ ఔషధ కంపెనీలపై కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 10వ తేదీన తేదీన కేసులు ఫైలయ్యాయి. మదుమేహం, క్యాన్సర్, హెచ్ఐవీ, మూర్ఛ వ్యాధి మందులు సహా సుమారు వెయ్యి రకాల ఔషధాల ధరలను నిర్ణయించడంలో 20 ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, కుట్రపూరితంగా ధరలను పెంచుతున్నాయంటూ అభియోగాలు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల్లో దేశీయంగా అరబిందో, గ్లెన్మార్క్, లుపిన్, వోక్హాడ్, జైడస్, సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ తదితర సంస్థలు ఉన్నాయి. వీటికి తోడు ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మందుల తయారీ కంపెనీ టెవా ఫార్మాస్యూటికల్స్ కూడా ఉండటం గమనార్హం.
కోట్ల డాలర్ల కుంభకోణం..
అమెరికన్ల జీవితాలతో ఆటలాడుతూ జనరిక్ మందుల తయారీ రంగంలోని కొందరు వందల కోట్ల డాలర్ల కుంభకోణానికి తెర తీశారనడానికి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని కనెక్టికట్ అటార్నీ జనరల్ విలియమ్ టోంగ్ టోంగ్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ధరల దందాకు సంబంధించిన ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్లు, వాయిస్ రికార్డుల సాక్ష్యాలు తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన వివరించారు. 2013 జులై, 2015 జనవరి మధ్య పదుల సంఖ్యలో మందుల ధరలను అమాంతంగా పెంచేందుకు కంపెనీలు కుట్రకు పాల్పడ్డాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా 2013, 2014 జులై మధ్య కాలంలో 1200 జనరిక్ మందుల విలువ 448 శాతం పెరిగిందన్నారు. హెల్త్ కేర్ రంగంలో అమెరికాలో ఇది భారీ కుంభకోణమని ఆరోపించారు. అమెరికాలో వైద్య ఖర్చులు, మందుల ధరలు ఎందుకింత ఎక్కువగా ఉన్నాయన్న అంశంపై జరిగిన పరిశోధనలో ఈ కుంభకోణం బయటపడిందన్నారు. కాగా తాజా ఆరోపణలపై స్పందించిన టెవా ఈ ఆరోపణలను ఖండించింది. అలాగే ఇవి నిరాధారమైన ఆరోపణలన్నీ, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని సన్ ఫార్మా ప్రకటించింది. దీంతో మంగళవారం నాటి మార్కెట్లో హెల్త్ కేర్ సెక్టార్ 4 శాతం కుప్పకూలింది. సోమవారం సన్ఫార్మ ఏకంగా 21 శాతం పతనమైంది.