Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మద్యం సేవించడం కారణంగా మరుసటి రోజు ఏర్పడే బడలికను దూరం చేసేలా తాము మార్కెట్లోకి తీసుకువచ్చిన మార్నింగ్ ఫ్రెష్ డిటాక్స్ పానియానికి మంచి ఆదరణ లభిస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తొలత బెంగళూరు, చెన్నై, ముంబయి మార్కెట్లలో ఈ పానియాన్ని అందుబాటులోకి తెచ్చిన మార్నింగ్ ఫ్రెష్ సంస్థ బుధవారం హైదరాబాద్ మార్కెట్లోకి దీనిని ఆవిష్కరించింది. తమ ఉత్పత్తికి మెరుగైన ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మార్నింగ్ ఫ్రెష్ను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని మిథాలీ టాండన్ తెలిపారు. డిటాక్స్ మార్నింగ్ ఫ్రెష్ డ్రింక్ నూటికి నూరుశాతం సహజసిద్ధమైనదని మిథాలీ వివరించారు. రానున్న మూడు నుంచి ఐదేండ్ల కాంలో మార్నింగ్ ఫ్రెష్ను రూ.25 నుంచి 30 కోట్ల బ్రాండ్గా మార్కెట్లో నిలిపేలాని తాము భావిస్తున్నామన్నారు. మద్యం సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ను మార్నింగ్ ఫ్రెష్ దూరం చేస్తుందని.. శరీరంలో నిల్వ ఉండిపోయిన మద్యం, ఇతర చెడు పదార్ధాలు మలమూత్రాల ద్వారా బయటకు పంపేలా ఇది పని చేస్తుందని టాండన్ వివరించారు. దీనిని మలబారీ ఆకులు, విటమిన్-సితో పాటు సిల్స్ ప్రోటీన్తో తయారు చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ ఉత్పత్తి ప్రస్తుతం 60 బాటిళ్లలో నాలుగు ఫ్లేవర్లలో అందుబాటులో ఉంచినట్టుగా మిథాలీ వివరించారు. రానున్న రోజుల్లో దీనిని షాషేలు, పౌండర్ రూపంలో కూడా అందుబాటులోకి తేనున్నట్టుగా వెల్లడించారు. దీనికి తగిన ప్రణాళిక ఉందని వివరించారు.