Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతకు తోడు మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. లోహ, బ్యాంక్ రంగ స్టాక్స్ భారీగా కుంగడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 203 పాయింట్ల నష్టంతో 37,114 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో 11,142 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. రిలయన్స్ ఇండిస్టీస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో ట్రేడయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 10లాభంతో ట్రేడింగ్ను మొదలుపెట్టింది. జెట్ ఎయిర్వేస్ షేర్లు 6శాతం కుంగాయి. దీంతో మూడురోజుల్లో ఈ షేర్లు 20శాతం కుంగినట్లైంది. అత్యున్నత స్థాయిలోని మేనేజ్మెంట్ కంపెనీని వీడటంతో నష్టాల పరంపర కొనసాగుతోంది. యూనియన్ బ్యాంక్ షేర్లు 9.65శాతం కుంగి రూ.71.60కు చేరింది. నష్టాలు రూ.3,370 కోట్లకు పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జపాన్, కొరియా మార్కెట్లు నష్టపోగా.. ఆస్ట్రేలియా లాభపడ్డాయి. క్రూడ్ ధరలు 41సెంట్లు పతనమై 70.90 డాలర్లకు చేరింది. నిఫ్టీ 50లో బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, యూపీఎల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐఓసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, టైటాన్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అదేసమయంలో యెస్ బ్యాంక్, టాటా మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, గెయిల్, కోల్ ఇండియా, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టపోయాయి. యెస్ బ్యాంక్ ఏకంగా 9 శాతం పడిపోయింది. టాటా మోటార్స్ కూడా 7 శాతానికి పైగా క్షీణించింది. సెక్టోరల్ ఇండెక్స్లన్నీ దాదాపు నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియల్టీ మాత్రం లాభాల్లో నిలిచింది.