Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టోర్ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనుంది. వన్ప్లస్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. వన్ప్లస్ 7, 7 ప్రో ఫోన్లను భారత మార్కెట్లో ఆవిష్కరించిన అనంతరం కంపెనీ సీఈవో పెటె లావ్ ఈ విషయాన్ని తెలిపారు. 'హైదరాబాద్ ఉన్నత సంప్రదాయాలకు నెలవు. అంతేగాక.. టెక్నాలజీ, ఐటీ కేంద్రాలకు ఈ నగరం హబ్గా మారుతోంది. అందుకే వన్ప్లస్కు హైదరాబాద్ ఎంతో ప్రాముఖ్యమైన నగరం' అని పెటె లావ్ చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే భాగ్యనగరిలో తమ స్టోర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ స్టోర్ను ఏర్పాటు చేయనున్నట్టుగా వివరించారు. నాటి, నేటితరం టెక్నాలజీతో ఈ స్టోర్ను డిజైన్ చేస్తున్నట్లు పెటె లావ్ తెలిపారు. గోడలను రెండు లేయర్లలో నిర్మించనున్నారట. లోపలి లేయర్ను ఎరుపురంగు ఇటుకలతో, బయటి లేయర్కు పూర్తిగా వైట్ ఫినిషింగ్ చేయిస్తామని తెలిపారు. అధునాతనంగా కనబడటంతో పాటు హైదరాబాద్ సంప్రదాయం కూడా భవనంలో ప్రతిబింబిస్తుందని పెటె లావ్ అన్నారు. స్టోర్ డిజైన్కు సంబంధించిన ఒక ఫోటోను కూడా వన్ప్లస్ సంస్థ ఇండియా ట్విటర్ ఖాతాలో పంచుకుంది. 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తులతో ఈ స్టోర్ను నిర్మించనున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి.