Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం కీలక సూచన చేసింది. ఎన్బీఎఫ్సీలకు నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్న వేళ ఆ సంస్థలు ఎప్పటికప్పుడు తమకు పొంచి ఉన్న ఆర్థిక ముప్పు అంచనా వేసుకొనేందుకు గాను చర్యలు చేపట్టాలని తెలిపింది. ఇందులో భాగంగా రూ.5000 కోట్లు అంతకు మించి అస్తులను కలిగి ఉన్న మధ్యశ్రేణి ఎన్బీఎఫ్సీలు, బడా సంస్థలు విధిగా చీఫ్ రిస్క్ ఆఫీసర్లను (సీఆర్వో)నియమించుకోవాలని ఆర్బీఐ సూచించింది. ప్రముఖ ఎన్బీఎఫ్సీ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) సంస్థ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్బీఐ ఈ ప్రకటన చేయడం విశేషం. ఆర్థిక వ్యవస్థలో ఎన్బీఎఫ్సీ సంస్థ కార్యకలాపాల విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో సీఆర్వోలను నియమించుకోవాలని తెలిపింది. సీఆర్వోలను కంపెనీలు ఒక నిర్ధిష్ట కాలానికి నియమించుకోవాలని.. వారిని బోర్డు సమ్మతి లేకుండా విధుల నుంచి తప్పించకూడదని ఆర్బీఐ వివరించింది.