Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రెండు నెలలుగా సాగినా కార్పొరేట్ యుద్ధానికి తెర పడింది. మైండ్ ట్రీ సంస్థలో కీలక వాటాను చెజిక్కించుకొనే విషయంలో ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ ఎట్టకేలకు విజయం సాధించింది. గురువారం ఆ సంస్థ మైండ్ ట్రీ సంస్థలో కీలకమైన 26 శాతం వాటాను చేజిక్కించుకొనే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఐటీ సంస్థలో ఎల్ అండ్ టీ అత్యధికంగా వాటా కలిగిన పెద్ద సంస్థగా మారింది. వాటా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడంతో ఇక త్వరలోనే మైండ్ట్రీ సంస్థ బోర్డులోకి ఎల్ అండ్ టీ ప్రతినిధులకు చోటు లభించనుంది. దీనిక తోడు రానున్న రోజుల్లో ఆ సంస్థ మూలదన నిర్మాణ విషయంలో తగిన రిజల్యూషన్ను ప్రకటించే అవకాశం ఉంది. సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్తో పాటుగా పూర్తిస్థాయి డైరెక్టర్ల నియమకానికి ఇప్పటికే ఇంజినీరింగ్ దిగ్గజం కసరత్తు మొదలుపెట్టినట్టుగా సమాచారం.