Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మేటి లాభాలను నమోదు చేశాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. సెన్సె క్స్ 279 పాయింట్లు లాభపడింది. 37,393 పాయింట్ల వద్ద ముగిసింది. ఆరంభం నుంచి నామమాత్రపు లాభాలతో స్వల్ప లాభనష్టాల మధ్య కదలాడిన సూచీలు మిడ్ సెషన్ తరువాత పరుగులు పెట్టాయి. ఇక నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 11,257 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వారాంతం నేపథ్యంలో ఇన్వెస్టర్ల షార్ట్ కవరింగ్ ప్రభావంతో మార్కెట్లు ఎగిసినట్టు నిపుణులు భావిస్తున్నారు. సెక్టోరల్ ఇండెక్స్లన్నీ దాదాపు లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మినహా మిగ తావన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. ఐటీ, మెటల్ షేర్లు బాగా పెరిగాయి. మీడి యా, రియల్టీ రంగ షేర్లు కూడా జోరు చూపాయి. బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, వేదాంత, ఓఎన్జీసీ షేర్లు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మీడియా, మెటల్, రియాలిటీ సూచీలు భారీగా లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ షేర్లు దాదాపు 2శాతం లాభపడ్డాయి. మార్చి త్రైమాసిక ఫలితాలు నేడు వెలువ డనుండటంతో ఈ మేరకు షేర్లు ర్యాలీ చేశాయి. లుపిన్ షేర్లు దాదాపు 6శాతం పడిపోయాయి. కంపెనీకి చెందిన కర్మాగారాల్లో తనిఖీ చేసిన చేసిన యూఎస్ఎఫ్ డీఏ కొన్ని లోపాలను గుర్తించింది. ఈ అంశం షేర్లపై ప్రభావం చూపింది.