Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 537 పాయింట్ల ర్యాలీ
ముంబయి : గత కొద్ది రోజులుగా భారీ నష్టాలు..ఆద్యంతం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ స్టాక్ మార్కెట్లు వారంతం సెషన్లో కొనుగోళ్ల మద్దతుతో భారీ లాభాలు నమోదు చేశాయి. ఎఫ్ఎంసీజీ, విత్త, అటో, బ్యాంకింగ్, మీడియా, రియల్టీ రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 537 పాయింట్ల ర్యాలీతో 37,931కు చేరింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 150 పాయింట్ల లాభపడి 11,407ల వద్ద ముగిసింది. దీంతో వరుసగా రెండో సెషన్లోనూ మార్కెట్లు భారీగా లాభపడి నట్లయ్యింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలను సైతం పట్టించుకో కుండా మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం విశేషం. మే 19న వెలువడే ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మదుపర్లు సానుకూలంగా ఉండటం, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ త్రైమాసిక ఫలితాలతో ఆ కంపెనీ షేర్లకు మద్దతు లభించడం, ఇతర సాంకేతిక కారణాలు మార్కెట్లపై విశ్వాసాన్ని పెంచాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
రూ.1.37 లక్షల కోట్ల లాభం..
శుక్రవారం ఒక్క సెషన్లోనే మదుపర్లు రూ.1.37 ల క్షల కోట్ల సంపదను పెంచుకున్నారు. బీఎస్ఈలో లిస్టెడ్ కం పెనీ విలువ రూ.1,46,58,769.64 కోట్లకు చేరింది. ఇంత క్రితం సెషన్ ముగింపు సమయం కల్లా ఈ విలువ రూ.1,45,22,223.98 కోట్లుగా ఉంది. సెన్సెక్స్-30లో 7 స్టాక్స్ ప్రతికూలతలను ఎదు ర్కొగా 23 స్టాక్స్ లాభపడ్డాయి. యస్ బ్యాంకు, వేదాంత, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, సన్ ఫార్మా, టిసిఎస్, ఎన్టిపిసి సూచీలు 0.04 శాతం నుంచి 2.36 శాతం వరకు పడిపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, హీరో మోటో కార్ప్, మారుతి సుజుకి, కొటాక్ బ్యాంకు, బజాజ్ ఆటో స్టాక్స్ 3.30 శాతం నుంచి 6.09 శాతం వరకు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.