Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పసిడి డిమాండ్లో స్తబ్దత చోటు చేసుకోవడంతో శుక్రవారం ఆ లోహం ధరలు దిగి వచ్చాయి. అదే విధంగా పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ లేకపో వడంతో ఆ లోహం ధరపై రూ.625 తగ్గుదల చోటు చేసుకుంది. శుక్రవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.160 తగ్గి వరుసగా రూ.33,170, రూ.33,000గా నమోదయ్యింది. కిలో వెండిపై కూడా రూ.625 తగ్గి రూ.37,625గా పలికింది. అభరణాల వర్తకుల నుంచి పసిడికి డిమాండ్ తగ్గడంతో మార్కెట్లో ఈ లోహాల ధరలు దిగివచ్చాయని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.