Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్లో కీలక వాటా అమ్మకానికి గాను.. సమర్థుమైన కంపెనీని తేల్చేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు జెట్ ఎయిర్వేస్లో కీలక వాటాను కొనుగోలుకు బిడ్లు దాఖలు చేసినప్పటికీ.. ఏ సంస్థకు జెట్ను సమర్థంగా నిర్వహించగలదన్న విషయమై రుణదాత బృందం చర్చలు జరుపుతోంది. ఈ విషయమై రుణదాతల బృందానికి సారథ్యం వహిస్తున్న ఎస్బీఐ చైర్మెన్ రజనీశ్ కుమార్ శనివారం మాట్లాడుతూ జెట్ విషయంలో స్పష్టతవచ్చేందుకు మరో వారం పడుతుందని తెలిపారు. జెట్లో వాటా కొనుగోలుకు ముందుకు వచ్చిన సంస్థల ఆర్థిక సామర్థ్యంతో పాటు వాటికి ఉన్న బలాలు, బలహీనతలను తాము అధ్యయనం చేస్తున్నామని, న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్టుగా ఆయన తెలిపారు. షరతులు లేకుండా బిడ్లు దాఖలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగన ప్రశ్నకు రజనీశ్ అవునని సమాధానం ఇచ్చారు.