Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ రిటైల్ రంగంలో మరో విలీనం దిశగా అడుగుపడింది. ప్రముఖ రిటైల్ రంగ దిగ్గజం స్పెన్సర్స్ రిటైల్ సంస్థ గోద్రెజ్కు చెందిన ప్రీమియర్ ఫుడ్ రిటైలింగ్ విభాగం నేచర్స్ బాస్కెట్ను కొనుగోలు చేసింది. ఈ మేరకు ఆర్పీ సంజీవ్ గోయంకా గ్రూపునకు గోద్రెజ్కు మధ్య ఒక స్థిరమైన ఒప్పందం కుదిరింది. మొత్తం నగదు రూపంలో జరిగిన ఈ డీల్ విలువ దాదాపు రూ.300 కోట్లు. ఈ డీల్కు ఇంకా రెగ్యూలేటరీలు, షేర్ హోల్డర్ల అనుమతులు రావాల్సి ఉంది. దీనికి మరో మూడు నెలల్లో అన్ని అనుమతులు వచ్చేస్తాయని ఆర్పీ- సంజీవ్ గోయంకా గ్రూప్ రిటైల్ విభాగం అధిపతి తెలిపారు. ప్రస్తుతం నేచర్స్ బాస్కెట్ ముంబయి, పుణె, బెంగళూరుల్లో 36 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ డీల్తో ఆర్పీ సంజీవ్ గోయంకా గ్రూప్కు దేశంలో ఉన్న రిటైల్ స్టోర్ల సంఖ్య 192కు చేరుతుంది. ఈ డీల్ తర్వాత రెండు బ్రాండ్లను కలిపేస్తారా.. లేక ప్రత్యేకంగా నిర్వహిస్తారా అనేది తేలాల్సి ఉంది. డీల్కు అనుమతులు వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ఆర్పీ సంజీవ్ గోయంకా గ్రూప్ చెబుతోంది. తాజాగా నేచర్స్ బాస్కెట్ విలీనంతో తమ ఉనికి అంతగా లేని పశ్చి భారత్లో స్పెన్సర్స్ను విస్తరించి జాతీయ సంస్థగా దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగపడుతుందని గోయంకా గ్రూపు తెలిపింది. దీంతె ఓమ్నీ చానెల్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు కూడా ఇది దోహదం చేస్తుందని స్పెన్స్ర్స్ వివరించింది. రానున్న రోజుల్లో నేచర్స్ బాస్కెట్ను మరింతగా విస్తరించనున్నట్టుగా గోయంకా గ్రూపు వెల్లడించింది.