Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: దేశంలో నగదు లభ్యత మందగిస్తున్న వేళ ప్రజలు మార్కెట్లో క్రయవిక్రయాలకు డెబిట్ కార్డును (ఏటీఎం కార్డును) చాలా విరివిగా ఉపయోగిస్తున్నట్టు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తన విశ్లేషణలో తెలిపింది. గత మార్చి మాసంలో సేకరించిన సమాచారం మేరకు పాయింట్ ఆఫ్ సేల్స్ ద్వారా డెబిట్ కార్డుల వినియోగంలో 27% వృద్ధి నమోదు అయిందని ఆర్బీఐ తెలిపింది. ఇదే సమయంలో ఏటీఎం వాడకంలో 15% వృద్ధి నమోదు అయింది. మార్చి మాసంలో పీవోఎస్ల వద్ద దేశ వ్యాప్తంగా దాదాపు 40.7 కోట్ల డెబిట్ కార్డుల వినియోగాలు నమోదు అయినట్టుగా ఆర్బీఐ తెలిపింది. ఇదే సమయంలో డెబిట్ కార్డు ద్వారా నిర్వహించిన ఏటీఎం లావాదేవీల సంఖ్య 89.1 కోట్లుగా నమోదు అయిందని ఆర్బీఐ తెలిపింది. దేశంలో మోడీ సర్కారు అనాలోచితంగా పెద్దనోట్ల రద్దు చేపట్టిన నేపథ్యంలో ఏర్పడిన నోట్ల కొరతతో నుంచి డెబిట్ కార్డుల వినియోగం పెరుగుతూ వస్తోందని సర్కారు వర్గాలు చెబుతున్నాయి. పీఓఎస్ల వద్ద క్రెడిట్ కార్డుల వాడకంలో 22% వృద్ధి నమోదు అయింది. మొత్తంగా 16.2 కోట్ల మేర పీవోఎస్ లావాదేవీలు నమోదయ్యాయి.