Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాణిజ్య యుద్ధంతో ప్రమాదమే : మోర్గాన్ స్టాన్లీ
న్యూయార్క్: అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైతే అది ప్రపంచానికి పెనుముప్పుగా తయారయ్యే అవకాశం ఉందని ప్రముఖ అమెరికా బ్యాంకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించింది. ప్రస్తుతం అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు విఫలమై చైనా వస్తువులపై సుంకాలు గనుక పెరిగితే ఆ పరిణామం ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వైపు తీసుకుపోయే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది. దీంతో పరిస్థితిని అదుపు చేసుకొనేందుకు అమెరికా వడ్డీరేట్లను మరింతగా తగ్గించుకొని సున్నాకు చేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బ్యాంకింగ్ సంస్థ తెలిపింది. ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఉద్రిక్తతలు ప్రస్తుతానికి ఎక్కువగా నష్టం చేకూర్చనప్పటికీ.. ఈ సమస్య పరిష్కారానికి జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడితే గనుక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ వివరించింది. చైనా నుంచి వచ్చే 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 25% సుంకాలను విధించాలన్న అమెరికా ప్రతిపాదనకు ఒక మధ్యస్త పరిష్కారం లభించకుంటే ప్రపంచం మాంద్యం వైపు అడుగులు వేసే పరిస్థితిని వీక్షించాల్సి వస్తుందని బ్యాంక్ విశ్లేషకులు ఒక నోట్లో వెల్లడించారు. దీంతో అమెరికా కేంద్ర బ్యాంక్ 2020 వసంత కాలం నాటికి మళ్లీ వడ్డీరేట్లను సున్నాకు చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుం దని తెలిపింది. దీంతో చైనా తన ఆర్థిక వ్యవస్థకు ఆదుకొనేందుకు గాను ఆర్థిక ఉద్దీపనను జీడీపీలో 3.5 శాతానికి పెంచాల్సిన పరిస్థితి రావచ్చని తెలిపింది. వాణిజ్య ఆంక్షల తీవ్రత పెరిగేత అది వివిధ రూపాల్లో ప్రతిబింబించే అవకాశం లేకపోలేదని స్టాన్లీ తెలిపింది.