Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: యువతను ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న జిక్సర్ ఎస్ఎఫ్250 వాహనాన్ని సుజుకీ మోటర్ సైకిల్ సంస్థ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధరను కంపెనీ రూ.1.71 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ) నిర్ణయించింది. జిక్సర్ ఎస్ఎఫ్-250 బైక్ 4-స్ట్రోక్, సింగిల్ సిలండర్, ఆయిల్ కూల్డ్, 249 సీసీ ఇంజిన్తో రూపొందించారు. ఈ వాహనాన్ని కంపెనీ అత్యాధునిక టెలిస్కోపిక్ సస్పెన్షన్తో తయారు చేశారు. కొత్త జిక్సర్ను సుజుకీ సంస్థ 17 అంగుళాల రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్తో తయారు చేశారు. ఈ బైక్ మెటాలిక్ మ్యాట్ ప్లాటినమ్, సిల్వర్ అండ్ మెటాలిక్ మ్యాట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుందని సంస్థ తెలిపింది.ఈ బైక్లో ఆల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ట్విన్ బ్యారెల్ ఎక్స్హాస్ట్ వంటి ఫీచర్లున్నాయి. కొత్త జిక్సర్ వాహనానికి 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో అందుబాటులోకి తెచ్చారు. ఈ బైక్ మొత్తంగా 161 కిలోల బరువు ఉంటుంది. కొత్త జిక్సర్కు తోడుగా ఆధునికీకరించిన జిక్సర్ ఎస్ఎఫ్ బైక్ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ.1.09 లక్షలుగా నిర్ణయించారు. జిక్సర్ ఎస్ఎఫ్ బైక్లో 155 సీసీ 4 స్ట్రోక్ 1 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో ఐదు గేర్లు ఉంటాయి. దేశంలో ప్రీమియం బైక్ల మార్కెట్కు క్రమంగా డిమాండ్ పెరుగుతూ వస్తున్నందున తాము జిక్సర్ ఎస్ఎఫ్ వాహనాన్ని ఆధునికీకరిస్తూ కొత్త బైక్లను అందుబాటులోకి తెస్తున్నట్టుగా సుజుకీ మోటర్ సైకిల్ ఇండియా కంపెనీ అధినేత కియిచిరో హిరోరు తెలిపారు.