Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రముఖ ఐటి కంపెనీ టెక్ మహీంద్రా 2019 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 8.4 శాతం పతనంతో రూ.1,126.6 కోట్ల నికర లాభాలతో సరిపెట్టుకుంది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,230.8 కోట్ల లాభాలు సాధించింది. ముంబయి కేంద్రంగా పని చేస్తున్న ఈ కంపెనీ క్రితం క్యూ4లో 10.4 శాతం వృద్ధితో రూ.8,892.3 కోట్ల రెవెన్యూ సాధించింది. కాగా 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ఈ కంపెనీ నికర లాభాలు 13.2 శాతం పెరిగి రూ.4,288.8 కోట్లకు, రెవెన్యూ 12.9 శాతం వృద్ధితో రూ.34,742.1 కోట్లకు చేరాయి. గత ఆర్ధిక సంవత్సర ఫలితాలపై తాము సంతృప్తిని వ్యక్తం చేస్తున్నామని టెక్ మహీంద్రా ఎండి, సిఇఒ సిపి గుర్నాని పేర్కొన్నారు. 2019 మార్చి ముగింపు నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,21,082కి చేరిందన్నారు. ఇదే సమయంలో 938 ఆక్టివ్ క్లయింట్లు ఉన్నారన్నారు.