Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ప్రముఖ బేరింగ్ ఉత్పత్తుల కంపెనీ ఎస్కెఎఫ్ ఇండియా బోర్డులో కొత్తగా స్వతంత్ర డైరెక్టర్లుగా గోపాల్ సుబ్రహ్మాణ్యం, అను వాఖ్లులను నాన్ ఇండిపిండెంట్ డైరెక్టర్లుగా వెర్నర్ హాఫ్ మాస్, అల్డో సెడ్రోస్లను నియమితులయ్యారు. గోపాల్ గతంలో ఎల్అండ్టీకి చెందిన కోమాత్సు సీఈఓగా పని చేశారని ఎస్కెఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. తయారీ రంగంలో ఆయనకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని పేర్కొంది. అను వాఖ్లు కన్సల్టెంగ్ కంపెనీ ప్రగతి లీడర్షిప్లో సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. 2019 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా చీఫ్ ఫైనాన్సీయల్ ఆఫీసర్గా అనురాగ్ భగానియాను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుందని ఎస్కెఎఫ్ ఇండియా ఎండీ మనీష్ భట్నాగర్ తెలిపారు.