Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 383 పాయింట్ల పతనం
- కేవలం మూడు స్టాక్స్కే మద్దతు
ముంబయి : అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుల నుంచి కిందకి జారాయి. మంగళవారం సెషన్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్ ఏకంగా 39వేల దిగువన చోటు చేసుకుంది. ఇంతక్రితం సెషన్లో ఎగ్జిట్ పోల్స్ కిక్తో సూచీలు రికార్డు స్థాయిలను చేరిన విషయం తెలిసిందే. ఆ ర్యాలీ ఒక్క రోజు కూడా నిలువలేకపోయింది. బీఎస్ఇ సెన్సెక్స్ ప్రారంభంలో 39,571.73 గరిష్ట స్థాయిలో ప్రారంభమైనప్పటికీ క్రమంగా అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుంది. తుదకు బీఎస్ఇ సెన్సెక్స్ 383 పాయింట్లు తగ్గి 38,970కి పడిపోయింది. ముఖ్యంగా టాటా మోటార్స్, మారుతి సుజుకి, ఇండుస్ఇండ్ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్ స్టాక్స్ అధిక నష్టాలు చవి చూపడంతో మార్కెట్లపై ఒత్తిడి చోటు చేసుకుంది. సెన్సెక్స్-30లో కేవలం మూడు స్టాక్స్ మాత్రమే లాభపడ్డాయి. ఇందులో రిలయన్స్ 1.08 శాతం, బజాజ్ ఫినాన్స్ 0.76%, హెచ్యుఎల్ 0.62 శాతం చొప్పున పెరిగిన వాటిలో ఉన్నాయి. మిగితా 27 స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. టాటా మోటార్స్ అత్యధికంగా 7.05 శాతం, మారుతి సుజుకి 3.25 శాతం, ఇండుస్ఇండ్ బ్యాంకు 3.02 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.65 శాతం, ఎంఅండ్ఎం 2.61 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. విదేశీ మారకం మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్ కూడా మార్కెట్ విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఫలితంగా సూచీల మూడురోజుల వరుస ర్యాలీకి నేడు ముగింపు పడినట్లైంది. ఇంట్రాడేలో అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టపోయినప్పటికీ... అటో, మెటల్, మీడియా రంగ షేర్ల ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.