Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో తాత్కాలికంగా సేవలు నిలిపివేసిన జెట్ ఎయిర్ వేస్లో వాటాలు కొనుగోలు చేసేందుకు హిందూజా గ్రూప్ ఆసక్తి చూపుతోందని సమా చారం. జెట్ వాటాల కొనుగోలుకు బిడ్డింగ్ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై జెట్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఇన్వెస్టర్ ఎతిహాద్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ నేతత్వంలోని రుణదాతలతో చర్చలు జరుగుతున్నట్టు వెల్లడించాయి. ఈ రిపోర్టులో మంగళవారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ విలువ 14.73శాతం లాభపడి రూ. 150.75 వద్ద ముగిసింది. కాగా దీనిపై ఎస్బీఐ, ఎతిహాద్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. క్రితం ఏప్రిల్లో జెట్ సేవలు నిలిచిపోగా.. క్రితం వారంలో ఆ కంపెనీ సీఈఓ, సీఎఫ్ఒ, పలువురు కీలక డైరెక్టర్లు వైదొలిగిన విషయం తెలిసిందే.