Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఎన్నికల నేపథ్యంలో డీలా పడిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టా లెక్కించేందుకు గాను ఆర్థిక శాఖ సన్నాహాలను పూర్తి చేసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ ఆర్థిక శాఖ 100 రోజుల ఎజెండాతో కార్యనిర్వాహక ప్రణాళి కను సిద్ధం చేసి పెట్టింది. కేంద్రంలో ఎవ్వరు కొత్తగా అధికారంలోకి వచ్చినా దీనిని అమలు చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. దేశ వృద్ధి రేటు 6.6 శాతానికి పడిపోయిన వేళ ఆర్థిక శాఖ సీరియస్ అయినట్టుగా సమాచారం. ఈ ఎజెండాలో భాగంగా ప్రయివేటు పెట్టుబడులను పెంపొందిం చడం, ఉద్యోగాల కల్పన, రైతులకు ఊరటనివ్వడం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్ల లో వృద్ధిని సాధించడంతో పాటు పన్ను విధానాలను సరళీకరించడం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.