Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఆటోమేషన్ తో సహా పలు కొత్తకొత్త టెక్నాలజీల రాకతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ కల్పన వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. ఈ నేపథ్యం లో మానవ వనరుల నిర్వహణ విభాగాల వారు కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగాల్సి వస్తోందని సొసైటీ ఫర్ హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (ఎస్హెచ్ఆర్ఎం) సంస్థ సీఈవో అచల్ ఖన్నా అన్నారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐదో హెచ్ఆర్ టెక్ అపెక్ సమావేశాన్ని అచల్ ప్రారంభించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొని హెచ్ఆర్ అంశాలపై మాట్లాడారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా 500 సంస్థలకు చెందిన 1500 మందికి పైగా డెలిగేట్స్ పాల్గొననున్నారు. హెచ్ఆర్లో వస్తున్న అధునికపోకడలు వాటిని ఎదుర్కొనేందుకు హెచ్ఆర్ విభాగంలోని అధికారులు చేపట్టాల్సిన చర్యలను గురించి.. ఈ సమావేశంలో వక్తలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని యువత ఎంటర్ప్రీనియర్లుగా ఎదిగేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు స్టార్టప్ వాతావరణాన్ని కల్పిస్తున విషయాన్ని ఆయన ఇక్కడ ఉదహరించారు.