Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నోట్లరద్దు అంశా న్ని ఆసరాగా చేసుకొని మనీలాండ రింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముసద్దిలాల్ జ్యువెల్ల ర్స్ నిర్వాహకు లకు హైకోర్టులో చుక్కె దురైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ జ్యువెల్లరి నిర్వాహకులు దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని మార్చుకునేందుకు బోగస్ విక్రయాలకు పాల్పడి న కేసులో ముస ద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రెయివేట్ లిమి టెడ్పై ఈడీ కొరడా ఝూళిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబం ధించి సీసీఎస్ పోలీసులు మొత్తం రూ. 110.85 కోట్ల గోల్మాల్కు సంబంధిం చి చారి ్జషీట్ దాఖలుచేయగా.. ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ముసద్దీలాల్తో పాటు దాని అనుబంధ సంస్థలు, కుంభకోణంతో ప్రమే యమున్న సంస్థలు, కైలాష్ గుప్తా, నిఖిల్ గుప్తా సహా కొందరు యజమానుల ఇళ్లపై వరుస దాడులు చేసింది. ఈ సోదాల్లో లభించిన రూ.82.11 కోట్ల విలువైన 145.89 కేజీల బంగారాన్ని ఈడీ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.