Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోని ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన షాప్ క్లూస్ను టేకోవర్ చేసుకునేందుకు స్నాప్డీల్ సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ డీల్ విషయమై ఈ సంస్థల మధ్య తది దశ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 200 నుంచి 250 మిలియన్ డాలర్ల మధ్య ఈ డీల్ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు చెబతున్నాయి. అయితే విలీనం విషయమై రెండు సంస్థలూ ఇప్పటి వరకకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దేశీయంగా పెరిగిన పోటీలతో ఇప్పుడు షాప్ క్లూస్ను చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న స్నాప్డీల్ గతంలో విపరీతమైన నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే స్నాప్డీల్ను సొంతం చేసుకునేందుకు ఫ్లిప్కార్ట్ విఫలయత్నం చేసింది. ఆ డీల్కు తలొగ్గని స్నాప్డీల్ సొంత కాళ్లమీద నిలబడాలనే ఆలోచనతో సంస్థ నష్టాలను తగ్గించడానికి ప్రణాళికా బద్దంగా అడుగులు వేసింది. ఈ సంస్థ తీసుకున్న చర్యలు నష్టాల్ని భారీగా తగ్గించేందుకు దోహదం చేశాయి. ఇప్పుడు తన కార్యకలాపాలను విస్తరించేందుకు చూస్తున్న స్నాప్డీల్ తాజాగా క్లూస్ నెట్వర్క్ చేతిలో ఉన్న షాప్ క్లూస్ను సొంతం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. షాప్ క్లూస్ను కూడా నష్టాలు బాగానే చుట్టుముట్టాయి. అయితే స్నాప్డీల్ లాగానే ఈ సంస్థ కూడా నష్టాలను తగ్గించుకునేందుకు విపరీతంగా క షి చేస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.347 కోట్ల నష్టాన్ని చవిచూసిన ఈ సంస్థ తర్వాత సంవత్సరంలో తన నష్టాలను రూ.208 కోట్లకు తగ్గించుకోగలిగింది. తాజా విలీనం ఒప్పందం కుదిరితే వాల్మార్ట్ చేతిలో ఉన్న ఫ్లిప్కార్ట్, అమెజాన్ తర్వాత మూడో అతిపెద్ద సంస్థగా స్నాప్డీల్ అవతరిం చనుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.