Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత ప్రజలు మరోసారి ప్రధాని నరేంద్రమోదీ సర్కారుకే ఓటు వేశారు. భాజపాకు గతంలో కన్నా ఎక్కువ సీట్లు అందించారు. అయితే 2014లో మోదీ గెలిచిన రోజు నుంచి స్టాక్మార్కెట్లు రూ.75.25 లక్షల కోట్ల సంపదను సృష్టించాయి. ఈ ఐదేండ్లలో బెంచ్మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 61% పెరిగింది. 2014, మే 16 నుంచి నేటి వరకు సెన్సెక్స్ను విశ్లేషిస్తే 14,689.65 పాయింట్లు లేదా 60.80 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక తాజా ఎన్నికల ఫలితాలు విడుదలైన 2019, మే 23న సూచీ జీవితకాల గరిష్ఠం 40,124.96 పాయింట్లను తాకింది. ఈ ఐదేండ్లలో బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.75 లక్షల కోట్ల నుంచి రూ.150.25 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే ఏకంగా రూ.75.25 లక్షల కోట్ల పెరుగుదల అన్నమాట.