Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎతిహాద్, హిందుజాలకు కొత్త ఆఫర్
న్యూఢిల్లీ: నగదు ఇబ్బందులతో మూత పడిన జెట్ ఎయిర్వేస్ సంస్థను తిరిగి తెరింపిచేందుకు గాను కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆ సంస్థ రుణదాతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆ సంస్థలో దాదాపు 20 శాతం వాటాను తమ వద్దే ఉంచుకొని మిగతా వాటాను ఔత్సాహిక పెట్టుబడిదారులకు విక్రయించాలని బ్యాంకులు భావిస్తున్నట్టుగా సమాచారం. జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఇప్పటికే వాటాదారైన ఎతిహాద్ సంస్థ మూతపడిన సంస్థలో ఒక పరిమితి మేరకే తమ సొంత పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా భారత్లోని సంపన్న కుటుంబాలు లేదా కార్పొరేట్ వర్గాలతో మిగతా వాటాను కొనుగోలు చేయించాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ఆ సంస్థ షరతులతో కూడిన బిడ్ను దాఖలు చేసింది. మరోవైపు హిందుజాలతో కీలక వాటాను కొనుగోలు చేయించేలా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే హిందుజాలు కూడా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి జెట్ ఎయిర్వేస్లో కీలక వాటాను కొనుగోలు చేయలేమని తేల్చి చేప్పారు. దీంతో ఆర్థికంగా సుసంపన్నంగా ఉన్న ఎతిహాద్, హిందుజాలకు జెట్ ఎయిర్వేస్లో కీలక వాటా అప్పగిస్తే ఆ సంస్థకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం రుణదాతల్లో ఏర్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు సంస్థలతో జెట్లో కీలక వాటాను కొనిపించాలని చూస్తున్న రుణదాతలైన బ్యాంకులు అవసరమైతే ఆ సంస్థలో దాదాపు 20% వరకు వాటాను తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జెట్ను తిరిగి గాడిలోకి తెచ్చాక రెండు నెలల తరువాత ఆ సంస్థలో తమకున్న వాటాను ఇతర సంస్థలకు విక్రయించాలని రుణదాత సంస్థలు భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే రుణదాత సంస్థలు హిందుజాలు, ఎతిహాద్ సంస్థలకు వెల్లడించినట్టుగా సమాచారం. ఈ విషయమై ఎస్బీఐకి చెందిన ఒక అధికారి సమక్షంలో హిందుజా గ్రూపునకు బృందం ఎతిహాత్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైనట్టుగా సమాచారం.