Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: పెట్టుబడుల మాంత్రికుడిగా పేరున్న కుబేరుడు వారెన్ బఫెట్తో కలిసి ఒకపూట భోజనం చేసే అవకాశం మరోమారు అందుబాటులోకి వచ్చింది. ఆదివారం సాయంత్రం ఈబే వెబ్సైట్ వేలం నిర్వహించేందుకు బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. బిడ్డింగ్లో పాల్గొనేందుకు 25,000 డాలర్లు (రూ.17,50,000) కనీస మొత్తంగా నిర్ణయించారు. అమెరికలోని న్యూయార్క్ నగరంలోని మాన్హ్యాటన్లోని ఓ విలాసవంతమైన హోటల్లో ఈ విందును ఏర్పాటు చేయనున్నారు. వేలంలో గెలిచిన బిడ్డర్ ఏడుగురు స్నేహితులతో కలిసి బఫెట్తో విందు ఆరగించొచ్చు. మే 31న రాత్రి 7:30 గంటలకు వేలం ఆరంభం అవుతుంది. బఫెట్తో భోజన సమయంలో విలువైన సలహాలు పొందొచ్చు. ఆయన ఆలోచనా పద్ధతులను తెలుసుకోవచ్చు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో వివిధ సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు బఫెట్ 19 ఏళ్లుగా విరాళాలు సేకరిస్తున్నారు. ఈ సారి గ్లైడ్ సంస్థకు విరాళం అందజేయనున్నారు. ఈ ఏడాది వేలం ద్వారా 3.46 మిలియన్ డాలర్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2012లో ఓ అజ్ఞాత వ్యక్తి ఈ మొత్తానికి బఫెట్తో భోజనం చేసే అవకాశం దక్కించుకున్నారు. గతేడాది 3.3 మిలియన్ డాలర్లు వచ్చాయి. 'మనం చేసే సాయం ఎంతో మార్పు తెస్తుంది. జీవితంలో ఇంకా ఆశ మిగిలే ఉందని తెలియజేస్తుంది. మిగతా సమాజమంతా అభాగ్యులను పట్టించుకోకపోవచ్చు. కానీ గ్లైడ్ వారికో అవకాశం ఇస్తోంది' అని బఫెట్ అన్నారు.