Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజ సంస్థ ఒప్పో మార్కెట్లోకి రెండు అత్యాధునిక స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో, ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ పేరుతో వీటిని మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లతో సంస్థ వీటిని విడుదల చేసింది. ఒప్పో రెనోను సింగల్ వేరియంట్గానే తీసుకురాగా, రెనో ఎక్స్ జూమ్ను రెండు వేరియింట్లలోలాంచ్ చేసింది. ఒప్పో రెనో ఫోన్ను 1080 ఇంటు 2340 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగిన 6.4 అంగుళాల తెర, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్,256 జీబీ ఇంటర్నల్ మెమోరీ, ఆండ్రాయిడ్ 9.0 పై, 48 మరియు 5ఎంపీ సామర్థ్యం కలిగిన రెండు వెనుక కెమేరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3765 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో సంస్థ విడుదల చేసింది. ఈ ఫోన్లో బేసిక్ వేరియంట్ ధరను సంస్థ రూ.32,990గా నిర్ణయించింది. మరోవైపు రెనో 10 ఎక్స్ జూమ్ ఫోన్ను 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్855 ప్రాసెసర్, 1080 ఇంటు 2340 పిక్సెల్స్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 48, 13, 8 ఎంపీ సామర్థ్యం కలిగిన మూడు వెనుక కెమేరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమేరా, 4065 ఎంఏహెచ్ బ్యాటరీతో సంస్థ మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ ఫోన్ బేసిక్ ధరను కంపెనీ రూ.39,990గా నిర్ణయించింది. అడ్వాన్స్డ్ ఫోన్ ధరను కంపెనీ రూ.49,990గా ప్రకటించింది. ఈ ఫోన్లు వినియోగదారులకు వచ్చేనెల 7వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, పే టీఎం మాల్, స్నాప్డీల్ ద్వారా లభ్యం కానున్నాయి.