Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌహతి: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హుందాయ్ ఈ ఏడాది జులైలో భారత మార్కెట్లోకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వాహనం 'కోనా'ను ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 'భారత విపణిలో హుందాయ్కి సంబంధించిన కొత్త మోడళ్లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం. దీనిలో భాగంగానే కోనా ఎస్యూవీ ఎలక్ట్రిక్ వాహనాన్ని జులైలో భారత్లో విడుదల చేస్తాం' అని హుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సీనియర్ జనరల్ మేనేజర్ పునీత్ ఆనంద్ తెలిపారు. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఈ మోడల్ కారు మార్కెట్లోకి విడుదల చేసిన వెంటనే మరో సరికొత్త మోడల్ 'గ్రాండ్ ఐ10' ని భారత విపణిలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆనంద్ పేర్కొన్నారు. ఈ ఏడాది మే 21న హుందాయ్ కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో 'హుందారు వెన్యు' మోడల్ కారును భారత్లో విడుదల చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే 20 వేల బుకింగ్స్ చేసుకున్నారని ఆనంద్ చెప్పారు. వీటికి అనుగుణంగా ప్రస్తుతం చెన్నై ప్లాంట్లో నెలకు 7 వేల యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నామని.. డిమాండ్ను దష్టిలో పెట్టుకొని రానున్న 3-4 నెలల్లో నెలకు 10 వేల యూనిట్లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రచించినట్లు ఆనంద్ పేర్కొన్నారు. ఒకసారి భారత మార్కెట్లో వెన్యు అమ్మకాలు ఒక స్థాయికి చేరుకోగానే సంస్థకు పట్టున్న విదేశీ మార్కెట్లకు ఈ మోడల్ను ఎగుమతి చేస్తామని అన్నారు.