Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 349 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 11,955 పాయింట్లకు చేరిన నిఫ్టీ
- ఆల్టైమ్ గరిష్టాల వద్ద సూచీలు
- కీలక పాత్రపోషించిన ఎఫ్ఐఐలు
ముంబయి: అంతర్జాతీయ సానుకూలతలకు తోడు దేశీయంగా మరోసారి సుస్థిరమైన ప్రభుత్వం కొలువుదీరనుందన్న వార్తల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పరుగులు పెట్టాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 11,955 వద్ద, సెన్సెక్స్ 349 పాయింట్లు పెరిగి 39,850 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. దీంతో రెండు సూచీలు ఆల్టైమ్ గరిష్ట స్థాయిల వద్ద ముగిసినట్టయింది. గురువారం నాటి మార్కెట్లో బ్లూచిప్ కంపెనీల షేర్లు ముందుడి ర్యాలీని నడిపించాయి. రిలయన్స్ ఇండిస్టీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టాటా కన్సల్టెన్సీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ల షేర్లు లాభపడంతో సూచీలు కూడా పరుగులు తీశాయి. దీంతో సూచీలు నిఫ్టీలో కీలకమైన 11,950 మార్కును దాటాయి. టెలికమ్, ఎనర్జీ, ఐటీ, నిత్యావసరాలు, విద్యుత్తు, ఫైనాన్స్ రంగాలు బాగా లాభపడ్డాయి. ఇక బీఎస్ఈలో ఆటో ఇండెక్స్ నష్టపోయింది. నిఫ్టీలో అన్నిటికంటే అత్యధికంగా ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. దాదాపు 3.2శాతం పెరిగి రూ.135కు చేరాయి. ఆ తర్వాతి స్థానాల్లో భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, యస్బ్యాంక్, భారత్ పెట్రోలియం, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, యూపీఎల్లు ఉన్నాయి. సన్ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ 50లో ఎన్టీపీసీ, యెస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, గెయిల్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో ముగిశాయి. యస్ బ్యాంక్ 2 శాతానికి పైగా లాభపడింది. అదేసమయంలో సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, ఎంఅండ్ఎం, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, వేదాంత, భారతీ ఇన్ఫ్రాటెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోయాయి. సన్ ఫార్మా 3 శాతంమేర పడిపోయింది. రూపాయి క్షీణత ఐటీ స్టాక్స్కు కలిసొచ్చింది. సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఆటో ఇండెక్స్లు మినహా మిగతావన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ రంగ షేర్లు బాగా ర్యాలీ చేశాయి. గురువారం నాటి మార్కెట్ ర్యాలీలో ఎఫ్ఐఐలు ప్రధానంగా కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది.