Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మతి తెలిపిన ఎన్సీఎల్టీ
న్యూఢిల్లీ: రుణ భారంలో కూరుకపోయి నష్టాల్లోకి జారుకున్న భూషణ్ ఎనర్జీ సంస్థను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ సమర్పించిన పునరుద్ధరణ ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం సమ్మతి తెలిపింది. దాదాపు రూ.800 కోట్లకు భూషణ్ ఎనర్జీని కొనుగోలు చేసేందుకు గాను టాటా సంస్థ ప్రతిపాదన చేసింది. అయితే దీనిని భూషణ్ గ్రూపునకు చెందిన కొందరు ప్రమోటర్లు మొదటి నుంచి తిరస్కరిస్తూ వస్తున్నారు. గురువారం ఈ విషయమై విచారణ చేపట్టిన ఎన్సీఎల్టీ భూషణ్ ఎనర్జీ సంస్థ మాజీ ప్రమోజర్ నీరజ్ సింఘాల్ లేవనెత్తిన అభ్యంతరాన్ని ఎన్సీఎల్టీ ఢిల్లీ బెంచ్ తోసిపుచ్చింది. టాటా స్టీల్ సంస్థ భూషణ్ ఎనర్జీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా తొలత రూ.730 కోట్ల మేర నిధులన చెల్లించనుంది. దీనికి తోడు మరో రూ.50 కోట్లను సంస్థ నిర్వహణ రుణదాతలకు చెలించనుంది. దీనికి అదనంగా టాటా స్టీల్ సంస్థ ఈక్విటీ ఇన్ఫ్యూజన్ రూపంలో దాదాపు రూ.367 కోట్ల మేర సొమ్మును సంస్థలోకి తీసుకురానుంది. భూషణ్స్టీల్ (బీఎస్ఎల్) సంస్థకు భూషణ్ ఎనర్జీ సంస్థ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. గత ఏడాది మే నెలలో జీఎస్ఎల్ను కూడా టాటా స్టీల్ సంస్థ సొంతం చేసుకున్న సంగతి విదితమే. రుణలకు సంబంధించిన రూ.1,200 కోట్లకు అదనంగా మరో రూ.35,200 కోట్ల మేర నగదును చెల్లించి బీఎస్ఎల్ను సంస్థ సొంతం చేసుకుంది.