Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రిగా మోడీ ప్రమాణ స్వీకరణ కార్యక్ర మానికి కార్పొరేట్ ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు హాజర య్యారు. గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోనే అపర కుబేరుడు, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతాఅంబానీ, కుమారుడు అనంత్తో సహా హాజరయ్యారు. మరోవైపు టాటా గ్రూపు సంస్థల ఎమిరైటస్ చైర్మెన్ రతన్టాటా హాజరయ్యారు. టాటాతో పాటు టీసీఎస్ ఛైర్మెన్ ఎన్. చంద్రశేఖరన్, ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలోని మొదటి వరుసలోనే టాటా, అంబానీలు కలిసి కూర్చొని వేడుకను ఆనందించారు. వీరితో పాటు పేటీఎం సంస్థ అధినేత విజరు శేఖర్ శర్మతో పాటు పలు కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రానికి హాజరైన పలువురు ఆధ్యాత్మిక గురువులతో ముఖేశ్ అంబానీ తన భావనలను పంచుకోవడం కనిపించింది. వీరితో పాటు ప్రముఖ రచయిత అమీశ్ త్రిపాఠి, దర్శకుడు కరన్ జోహార్ తదితరలు పాల్గొన్నారు.