Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను దేశ వృద్ధి రేటు ఐదేండ్ల కనిష్టానికి దిగజారి న నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) త్వరలో నిర్వహించనున్న ద్వైమాసిక పరిపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను అరశాతం మేర తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృద్ధి పడిపోవడం ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితుల నేపథ్యంలో జూన్ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను తగ్గించ వచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక వడ్డీరేట్లు తగ్గొచ్చని అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్బీఐ రెండో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జూన్లో జరగనుంది. జూన్ 6న సమీక్ష నిర్ణయాలను కేంద్రబ్యాంకు వెల్లడిస్తుంది. లోక్సభ ఫలితాల తర్వాత జరిగే తొలి సమీక్ష కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో జరిగిన ద్వైమాసిక సమీక్షల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించింది. దీని ప్రకారం.. ప్రస్తుతం రెపో రేటు 6శాతంగా ఉంది. జూన్లోనూ వడ్డీరేట్ల కోత చేపడితే.. ఏడాదిలో ఆర్బీఐ వరుసగా మూడు సార్లు వడ్డీరేట్లను తగ్గించినట్లవుతుంది.