Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో వస్తుసేవల పన్ను వసూళ్లలో కొంత పురోగతి కనిపిస్తోంది. జీఎస్టీ వసూళ్లు వరుసగా మూడవ నెలలో కూడా లక్ష కోట్ల మార్క్ను దాటాయి. మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మందగించినప్పటికీ జీఎస్టీ వసూళ్లు బాగా పుంజుకున్నాయి. దీంతో మే నెలలో రూ. 1,00,289 కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లు నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన వసూళ్లు 6.67 శాతం పుంజుకున్నాయి. జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్లో రూ.1,13,865 కోట్లగా నమోదు అయ్యాయి. మార్చిల ఈ పన్ను వసూళ్లురూ. 1,06,577 కోట్లుగా నిలిచాయి. శనివారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను అధికారికంగా విడుదల చేసింది. మే నెల వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ ఆదాయం రూ .17,811 కోట్లుగాను, ఎస్జీఎస్టీ రూ 24,462 కోట్లుగాను, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ఆదాయం. రూ 49,891 కోట్లుగా నమోదు అయింది. సెస్ వసూళ్లు రూ .8,125 కోట్లుగా ఉన్నాయి. 2019 మే నెలలో 3,108 రిటర్న్స్ దాఖలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రిటర్నులు పెరగడం జీఎస్టీకి శుభసూచికమని అధికారులు వెల్లడించారు.