Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీడీపీ వృద్ధి పెరగడానికి ఆర్థిన నిపుణుల సూచనలు
న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటని పాలకులు పదే పదే చెబుతున్నారు. కానీ ఈ ఏడాది నాలుగో త్రైమాసికానికి గానూ ఇటీవలే విడుదలైన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతంగా నమోదైంది. ఇది ఐదేండ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అయితే జీడీపీ వృద్ధి రేటు పెరగాలంటే ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు అవసరమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, తయారీ రంగాలలో ఈ మార్పులు చేపట్టాలని వారు అభిప్రాయపడుతున్నారు. జీడీపీతో పాటు గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ (జీఎఫ్సీఎఫ్)లో వృద్ధి కూడా మందగించింది. ఈ డిసెంబర్లో అది 3.6 శాతంగా నమోదైంది. కాగా జీఎస్టీ స్లాబులను పునరుద్ధరించడం, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం, ఆర్థిక రంగాల పునరుజ్జీవనం, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాల కల్పన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిని పురోగమభివృద్ధికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.