Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల రీత్యా తాత్కాలికంగా మూతపడిన జెట్ఎయిర్వేస్ సంస్థకు చెందిన 2000 మంది ఉద్యోగులను స్పైస్ జెట్ సంస్థలోకి తీసుకోను న్నారు. ఈ విషయాన్ని స్పైస్జెట్ సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ అజరు సింగ్ ఆదివారం తెలిపారు. ఈ సిబ్బందిలో పైలెట్లు, క్యాబిన్ క్రూ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అజరు సింగ్ మాట్లాడుతూ..ఇప్పటి వరకు 1100ల జెట్ సిబ్బందిని తీసుకున్నామని, ఈ సంఖ్య రెండువేలకు పెరగవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు తీసుకున్న వారిలో పైలట్లు, క్యాబిన్ క్రూ, ఎయిర్పోర్టు సర్వీసులు, సెక్యూరిటీ విభాగాల వారు ఉన్నారని చెప్పారు. భవిష్యత్తులోనూ మరింత మంది జెట్ సిబ్బందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.