Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత ఈ ఏడాది బ్రిటన్ను దాటేసి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందిన ఐహెచ్ఎస్ మార్కిట్ సంస్థ అంచనా కట్టింది. 2025 నాటికి సంస్థ ఆసియా ఫసిఫిక్ రీజియన్లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగనుందని మార్కిట్ సంస్థ సోమవారం తన తాజా విశ్లేషణలో వెల్లడించింది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో సుస్థిర సర్కారు అధికారంలోకి రావడంతో భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ధృక్కోణం అనుకూలంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. 2019-2023 మధ్య కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏడాదికి సగటున 7 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనా కట్టింది. ప్రస్తుత సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి మూడు లక్షల కోట్ల అమెరికన్ డాలర్లకు చేరవయ్యే అవకాశం ఉందని మార్కిట్ తెలిపింది. దీంతో ప్రపచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ స్థానాన్ని భారత్ భర్తీ చేసే అవకాశ: ఉందని తెలిపింది. అయితే ప్రస్తుతం భారత జీడీపీలో తయారీ రంగం వాటా 18 శాతం దరిదాపుల్లోనే ఉంటోందని..దీనిని 25 శాతానికి చేర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇలా చేయకుంటే నిరుద్యోగ సమస్య పెరిగిపోయి మోడీ సర్కారు కష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఈ సంస్థ నివేదికలో అభిప్రాయపడింది.