Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చేఏడాది అంతర్జాతీయ సేవలు
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరలకే విమానయాన సేవలను అందిస్తోన్న విస్తారా సంస్థ త్వరలో అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తీసుకు రానుంది. విస్తారా గ్రూప్ సంస్థ ఐఏటీఏ వార్షిక జనరల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో లెస్లీ థంగ్ మాట్లాడుతూ..'విమానయాన రంగంలో భారత్ అభివృద్ధి చెందుతూ ముందుకు దసుకుపోతోందని అన్నారు. దీంతో తాము సుదీర్ఘకాలం ఇక్కడ సేవలు అందించాలనుకుంటున్నామని ఆయన అన్నారు. 2019 రెండో అర్ధభాగంలో అంతర్జాతీయ కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. టాటాసన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ సంయుక్తంగా 2015 జనవరిలో విస్తారా ఎయిర్లైన్ను ప్రారం భించారు. ప్రస్తు తం విస్తారా వద్ద 22 విమా నాలు ఉన్నాయి. వారానికి 850 విమాన సర్వీసులను అంది స్తోంది.
మరో నాలుగు బోయింగ్ 737-800 ఎన్జీ, రెండు ఏ320 నియో విమానాలను లీజుకు తీసుకుంటున్నట్లు గత నెల విస్తారా ప్రక టించింది. దీంతో పాటు మరో 50 ఎయిర్బస్ విమానాలకు గతేడాది ఆర్డర్ ఇచ్చింది. 2023 నాటికి ఈ విమానాలు విస్తారా చేతికి రానున్నాయి. దీంతో రానున్న రోజుల్లో విస్తరా వేగంగా విస్తరించేందుకు సంస్థ వ్యూహరచన చేస్తోంది.