Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పైస్ జెట్ సీఈవో అజయ్ సిన్హా
ముంబయి: దేశీయ విమానయాన రంగ దిగ్గజం జెట్ ఎయిరవేస్ వైఫల్యం వైమానిక రంగానికి మేల్కొలుపు పిలుపు అని స్పైస్ జెట్ సీఈవో అజయ్ సిన్హా అభిప్రాయపడ్డారు. జెట్ మూతపడడంతో విధానకర్తల వైఫల్యం కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ సంస్థ మూసివేయడం విషాదకరమని ఆయన అన్నారు. అంతర్గత కారణాలు, అత్యధిక వ్యయాలు జెట్ వైఫల్యానికి కొన్ని కారణాలని పేర్కొన్నారు. అత్యధిక వ్యయ విధానాన్ని విమనయాన రంగంపై రుద్దడం ఒక కారణమైతే.. అంతర్గత వ్యవహారాలు మరో కారణమని ఆయన అన్నారు. వీటితో లాభాలు పొందడం కష్టమని తెలిపారు. వీటితో ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలతో పోటీపడలేమని ఆయన వివరించారు. భారత్ను గ్లోబల్ హబ్గా మారాలంటే.. విమానాశ్రయ ఛార్జీలు కూడా గ్లోబల్ హబ్స్తో పోల్చుకోవాలి. మనం వాటిని మార్చుకోకుంటే పోటీపడలేము అని ఆయన పీటీఐతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. స్పైస్ జెట్ కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. జెట్ఎయిర్వేస్ నుంచి 30 విమానాలను లీజుకు తీసుకొనేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం స్పైస్జెట్ వద్ద 100 విమానాలు ఉన్నాయి.